గోరా గా ప్రసిద్ధి చెందిన గోపరాజు రామచంద్రరావు సంఘసంస్కర్త, హేతువాది, నాస్తికవాద నేత. గోరా నవంబరు 15, 1902 న ఒడిషా లోని ఛత్రపురంలో పుట్టారు. పెళ్ళికి ముందే సెక్స్ పై అవగాహనలు, కుటుంబ నియంత్రణ వంటి వాటితో పాటు అప్పటి తెలుగు సమాజంలో ఎన్నో విప్లవాత్మక మార్పులను తెచ్చిపెట్టిన ఘనత గోరాదే.
Dr సమరం
గోపరాజు సమరంవైద్యుడు, రచయితభాష. గోపరాజు సమరం వైద్యుడు, సంఘ సేవకుడు, రచయిత. వైద్యవిజ్ఞాన సంబంధించిన విషయాలపై తెలుగులో అనేక గ్రంథాలు రచించాడు. సమరం నాస్తికవాది అయిన గోరా, సరస్వతి గోరాల కుమారుడు. వృత్తి రీత్యా వైద్యుడైన సమరం వివిధ రంగాలలో కృషి సలిపాడు. సమరం 1939 జూలై 30లో కృష్ణా జిల్లా, మచిలీపట్నంలో జన్మించాడు.గోపరాజు సమరంజననంజూలై 30, 1939మచిలీపట్నం, కృష్ణా జిల్లావిద్యఎం. బి. బి. ఎస్విద్యాసంస్థరంగరాయ వైద్య కళాశాల, కాకినాడవృత్తివైద్యుడు, రచయిత, సంఘ సేవకుడుతల్లిదండ్రులుగోరా (తండ్రి)గోపరాజు సరస్వతి (తల్లి)కాకినాడలోని రంగరాయ వైద్య కళాశాల నుండి ఎం.బీ.బీ.ఎస్. పట్టా పొంది సమరం 1970లో విజయవాడలో వైద్యునిగా వృత్తిజీవితాన్ని ప్రారంభించాడు. వందలాది ఉచిత వైద్యశిబిరాలు, టీకావైద్యం క్యాంపులు, నేత్ర శిబిరాలు, రక్తదాన శిబిరాలు, పోలియో శస్త్రచికిత్రా శిబిరాలు, కుటుంబ నియంత్రణ శిబిరాలు, హెచ్.ఐ.వీ. రక్తపరీక్షా శిబిరాలు నిర్వహించటంలో ప్రధానపాత్ర పోషించాడు. సమాజంలోని అన్నివర్గాల ప్రజాలలో ఎయిడ్స్ వ్యాధిపై అవగాహన పెంపొందించటంలో విశేషకృషి చేశాడు. సమరం స్వేచ్ఛాగోరా నేత్రనిధి యొక్క కార్యనిర్వాహక అధ్యక్షుడు. బాణామతి, చేతబడి వంటి మూఢనమ్మకాలను రూపుమాపడానికి సమరం వీటి సమస్య హెచ్చుగా ఉన్న మెదక్, నిజామాబాదు, అదిలాబాదు, నల్గొండ జిల్లాలో అనేక బృందాలతో పర్యటించాడు. జిల్లా అధికారులు, పోలీసు సూపరిండెంటు ఆహ్వానముపై బాణామతిపై అవగాహన పెంచడానికి వైద్యులు, శాస్త్రజ్ఞులు, మంత్రజాలికులు, మిమిక్రీ కళాకారులు, స్వచ్ఛంద కార్యకర్తలతో కూడిన బృందాలకు నాయకత్వం వహించాడు. సమరం విజయవాడలోని పోలీసు వైద్య కేంద్రము యొక్క గౌరవ నిర్దేశకుడు.డా. సమరం భారతీయ వైద్య సంఘ కార్యకలాపాల్లో క్రియాశీలకంగా పనిచేశాడు. స్థానిక, రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో అనేక ఉన్నత పదవులను చేపట్టాడు. 1980-81 సంవత్సరానికి గాను భారతీయ వైద్య సంస్థలో సంఘపు ఉత్తమ రాష్ట్రాధ్యక్షునిగా పురస్కారాన్ని అందుకున్నాడు. 1996-97లో భారతీయ వైద్య సంఘము (Indian Medical Association) యొక్క ఉపాధ్యక్షునిగా పనిచేశాడు.ఈయన భార్య డా. రష్మీ కూడా వీరి కృషిలో పాలుపంచుకుంటున్నారు.రచనలు
భక్త జయదేవ్
గీత గోవిందం
12సర్గలు
24 అష్టపదులు
80శ్లోకాలు